వసతిగృహాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి
కలెక్టర్ కు వినతి టిడిపి కోశాధికారి వి.నాగేశ్వరరావు
అల్లూరి ముచ్చట్లు:
డుంబ్రిగూడ మండలం కిల్లో గూడ బాలికల పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు వసతులు నీరు లేక కాలకృత్యాలు కూడా చేయడానికిఇబ్బందిగురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరకు.పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వినతి పత్రం అందజేశారు . ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి జైపూర్ జంక్షన్ కొత్త బిల్డింగ్ కు పంపిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగూడ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గొల్లోరి ప్రసాద్ సీనియర్ నాయకులు నాయుడు ఎస్టీ సెల్ కార్యదర్శి కొర్ర నాగరాజు తదితరుల పాల్గొన్నారు.

Tags: Good water facility should be provided in the hostels
