Natyam ad

మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

– మే 16న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం

– పారాయణం, యాగంలో పాల్గొనేందుకు 60 మంది వేద పండితులు

-. ఈవో ఏవి.ధర్మారెడ్డి

 

Post Midle

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో   ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్‌విబిసి, ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణంతో పాటు, యాగం నిర్వహించేందుకు పండితులను ఆహ్వానించాలని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్‌ఎస్ అవధానిని ఆయన ఆదేశించారు. ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.

 

 

అనంతరం ఆహ్వానితులకు రవాణా, వసతి, దర్శనం తదితర సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.అఖండ పారాయణం మే 16న ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సమూహంగా పటిస్తారని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజూ అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డిపిపి ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జెఈవో   సదా భార్గవి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన   వేణుగోపాల దీక్షితులు, ఎస్‌విబిసి సి ఈ వో
షణ్ముఖ్‌కుమార్, ఎస్‌ఇ 2   జగదీశ్వర్ రెడ్డి, ఎస్‌వివియు విసి   రాణిసదాశివమూర్తి, ఎన్‌ఎస్‌యు విసి శ్రీ కృష్ణమూర్తి, రవాణా శాఖ జిఎం   శేషారెడ్డి, హెచ్‌డిపిపి సెక్రటరీ   శ్రీనివాసులు, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్   రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్  విభీషణ శర్మ, పబ్లికేషన్స్ స్పెషల్ ఆఫీసర్  రామరాజు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

 

Tags: Hanumath Jayanti celebrations in Tirumala from 14th to 18th May

Post Midle