సర్వీస్ రూల్స్ ముసాయిదాపై హర్షం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపల్ ఉపాధ్యాయులకు యూనిఫైడ్ సర్వీస్రూల్స్ ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేయడంపై పిఎంటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.రాజా హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ అతిత్వరలో అమలుకానుండటం అభినందనీయమన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బోత్సా సత్యనారాయణకు , ప్రభుత్వానికి, మున్సిపల్ ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలుపుత్నునట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి శ్రీనాథ్, సభ్యులు శ్రీలక్ష్మీదేవి, జ్యోతి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Tags: Harsham on draft service rules