Natyam ad

హైటెక్ కోడి పందాలు..?

రాజమండ్రి ముచ్చట్లు:
తెలుగు వారి లోగిళ్ళలో పెద్ద పండగ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి,సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కనిపించేది కోడి పందాలు. నెల రోజుల ముందునుంచే పందెంరాయుళ్లు తమ కోళ్లకుకత్తులు కట్టి బరిలో దింపడానికి రెడీ అయిపోతుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు చోట్ల కోడి పందాల బరులను నిర్వాహకులు రెడీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికొన, పల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులోనిర్వాహకులు కోడిపందాలకు బరులు రెడీ చేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా ఐ.పోలవరం మండలంలో ఫ్లడ్ లైట్లు, డ్రోన్ కెమెరా చిత్రీ కరణ నడుమ కోడి పందాలను
హైటెక్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో కోడి పందాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.పల్లంకుర్రులో పందెంరాయుళ్లు పది ఎకరాల్లో పందాలు నిర్వహించడానికి బరులు రెడీ చేస్తున్నారు. అయితే ఈ కోడి పందాలకు అనుమతులుఇవ్వాలని రాజకీయనాయకులపై స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఓ వైపు జిలాల్లో సంక్రాంతి కి జోరుగా బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతోరెడీ అయిపోతుంటే.. మరో వైపు జిల్లా పోలీసులు పందెంరాయుళ్లపై కన్నెర్రజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో కోడి పందాలనుజరగనివ్వమని పోలీసులు చెబుతున్నారు.అయితే మరో వైపు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలను చూడడానికి ఆంద్రప్రదేశ్,తెలంగాణతో పాటు బెంగళూరు తదితర ప్రాంతల నుంచి వచ్చే వారి కోసం పందెంరాయుళ్లు ఇప్పటికే యానాం, అమలాపురం ప్రాంతాల్లో ఇప్పటికేవసతి గదులు బుకింగ్ చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Hi-tech chicken bets ..?