Natyam ad

ఏపీలో హై అలెర్ట్

విజయవాడ ముచ్చట్లు:
 
జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును ఇది ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసుల పరిస్థితి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. జగన్ సర్కార్ వైద్య రంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని జిల్లాల వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కి చికిత్స అందించే ఆస్పత్రులు వివరాలు ఇవే..
మొత్తం కోవిడ్ ఆస్పత్రులు 236
ఐసీయూ బెడ్‌లు మొత్తం 3609
నిండిన బెడ్లు 87, ఖాళీలు 3522
ఆక్సిజన్ కలిగిన ఐసియు బెడ్ లు మొత్తం 15,962
నిండిన బెడ్లు 184,ఖాళీలు 15,778
జనరల్ బెడ్లు మొత్తం 11277
నిండినవి 66, ఖాళీలు 11211
వెంటిలేటర్లు మొత్తం 1690
నిండినవి 14 ఖాళీలు 1676
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: High alert on AP