నో మీడియా, నో ర్యాలీ-స్కిల్ కేసులో హైకోర్టు తీర్పు
అమరావతి ముచ్చట్లు:
చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతు అంశంపై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయి. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags: High Court verdict in No Media, No Rally-Skill case
