శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో హుండీ కౌంటింగ్
చౌడేపల్లి ముచ్చట్లు:
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో 24 న సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 43 రోజులకు గాను నగదు రూపంలో రూ. 50,93,859.00, బంగారు 42 గ్రాములు, వెండి 300 గ్రాములు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 33,676.00 వచ్చినవి. హుండీ కౌంటింగ్ కార్యనిర్వాహణాధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగినది. మరియు సదరు లెక్కింపునకు ఆలయ ప్రధాన అర్చకులు, మదనపల్లి ఇన్స్పెక్టర్ శశి కుమార్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చౌడేపల్లి వారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Hundi counting in Sri Boyakonda Gangamma Devasthanam
