వికేంద్రీకరణకు మద్దతుగా ఐకాస
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశమైంది. ప్రొఫెసర్ లజపతిరాయ్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగిం ది.ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్,ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయ వాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించిందని, రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘా ల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దే శ్యమన్నారు.అక్టోబర్ 15 న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు.
Tags: ICASA supports decentralization

