పుంగనూరులో వీధి బాలలను గుర్తించండి – న్యాయమూర్తి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలో ఉన్న వీధి బాలలను గుర్తించి వారికి తగిన చేయూతనందించాలని సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు తెలిపారు. మంగళవారం వీధి బాలల దినోత్సవాన్ని పట్టణంలోని ఎన్ఎస్.పేట పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వీధి బాలలను గుర్తించి ఎప్పటికప్పుడు వారిని సంబధిత సంక్షేమ వసతిగృహాల్లో చేర్పించి వారికి తగిన విద్య అవకాశాలు కల్పించాలన్నారు. అలాగే ఈ విషయంపై వీధి బాలల తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించాలని , వీధి బాలలను కార్మికులుగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి బాలల కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కూడ అందించి వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలని, వీధి బాలలు లేకుండ నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Identify street children in Punganur – Justice Vasudeva Rao