Natyam ad

చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగినట్టే

విజయవాడ ముచ్చట్లు:

అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడి జగన్…. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు సీఎం జగన్. సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నామన్నారు. 300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ దాదాపుగా రూ.5.75లక్షలు. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది. కేంద్రం లక్షన్నర ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తుంది.

 

 

 

Post Midle

మిగిలిన డబ్బులను బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు లబ్ధిదారుడు కట్టుకోవాలని గత ప్రభుత్వం చెప్పిందన్నారు సీఎం. మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తాము వచ్చాక ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే రాసిచ్చామన్నారు. అయినా చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉందన్నారు.  చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదన్నారు. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి అందర్నీ మోసం చేశారన్నారు సీఎం జగన్. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటున్నారన్నారు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. వారికోసమే మేనిఫెస్టో అని అంటున్నారని విమర్శించారు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మొద్దని పిలుపునిచ్చారు. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుణ్ని మాత్రం నమ్మకూడదన్నారు సీఎం జగన్.

 

 

 

2014 -2019 వరకూ ఒక ఇళ్లపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదన్నారు సీఎం. కరోనా కష్టాలు రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా.. మీ కష్టం ఎక్కువే అని భావించి పరుగెట్టామన్నారు.  కోవిడ్‌ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చామని తెలిపారు. ఇచ్చిన ప్రతీ వాగ్దానం కూడా అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశామని వివరించారు. ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలదన్నారు సీఎం జగన్. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశామని తెలిపారు.  చంద్రబాబు, ఆయన దొంగల ముఠా గతంలో దోచుకుందన్నారు. గతంతో పోలిస్తే అప్పుల వృద్ధిరేటు చూస్తే తక్కవేనన్నారు. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. వారికి మంచి చేసే ఉద్దేశం లేదున్నారు. వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికేనన్నారు. ఇవాళ కులాల మధ్య యుద్ధం జరగడంం లేదని క్లాస్‌ వార్‌ జరుగుతోందన్నారు సీఎం జగన్.

 

 

నవులూరిలోని లేక్‌ను కూడా అభివృద్ధిచేస్తున్నామని వివరించారు.సామాజిక అమరావతి
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉందన్నారు సీఎం జగన్. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయని గుర్తు చేశారు. కానీ, పేదలకు ప్రభుత్వమే ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటంగా అభివర్ణించారు. ఇలాంటివి చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. పెదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా రాక్షసులు అడ్డుపడ్డారని ప్రతిపక్షాలను ఉద్దేశించి జగన్ విమర్శించారు. ఈ ప్రాంతంలో గజం ధర 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందన్నారు. అంటే ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సామాజిక పత్రాలుగా ఈ ఇంటి పత్రాలు ఇస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇదే అమరావతి..

 

 

ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఇకపై మన అందరి అమరావతి అవుతుందని చెప్పారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 1400 ఎకరాల్లో 50వేల మందికి ఇంటి స్థలాలు ఇస్తున్నామన్నారు సీఎం జగన్. 25 లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇస్తున్నట్టు వివరించారు. వారంరోజులపాటు ఈ పండుగ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రతి లే అవుట్‌ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి.. వారికిస్తున్న ఇంటి స్థలం చూపించి.. ఇంటి పట్టా ఇస్తామన్నారు. అక్కడే ఫోటో తీసుకుని చిరునువ్వులు వారి ముఖంలో చూసేలా కార్యక్రమం ఉంటుందన్నారు. జియో ట్యాగింగ్‌ తీసుకుని.. వారంరోజుల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాంమన్నారు. జులై 8న అంటే వైఎస్‌ ఆర్‌ జయంతి రోజున ఇళ్ల స్థలాల్లో ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు.

 

 

 

ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ జరిగే కార్యక్రమంలో ల్యాండ్‌ లెవలింగ్‌, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తైందన్నార సీఎం జగన్. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తామన్నారు. తాము కట్టుకుంటామంటే.. రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తామన్నారు. రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్‌ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తామని తెలిపారు. నిర్మాణకూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తామని వివరించారు. ఆప్షన్‌ 3గా ప్రభుత్వమే కట్టించాలని అడిగితే ఇళ్ల నిర్మించిన ఇస్తామన్నారు సీఎం జగన్. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్‌ తీసుకున్నా ఫర్వాలేదన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేస్తామన్నారు సీఎం జగన్. సిమెంటు, స్టీల్‌, డోర్‌ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందిస్తామన్నారు. మార్కెట్‌ రేట్‌ల కన్నా తక్కువకే ప్రభుత్వం ఇవన్నీ అందిస్తుందన్నారు. నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డబోమన్నారు. రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి ఇచ్చేలా చేస్తున్నామని వాటిని పావలావడ్డీకే ఇస్తున్నట్టు వివరించారు. ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుందన్నారు సీఎం. రూ.2-3 లక్షల కోట్లు మీ చేతిలో పెడుతున్నామన్నారు.

 

Tags:If you believe Chandrababu, you will drown

Post Midle