విశాఖ, తిరుపతి మధ్య మరో వందే భారత్
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఏపీలో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తుంది. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నాయని తెలుస్తోంది ఏపీలో మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని వార్తలొస్తు్న్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. నిన్న సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీల వందే భారత్ రైలు విశాఖకు బయలుదేరింది. ఈ రైలు విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతారో పూర్తి సమాచారం రాలేదు. కానీ తిరుపతి నుంచి విశాఖకు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాల్తేరు రైల్వే అధికారులు స్పందిస్తూ.. వందేభారత్ రైలుపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.విశాఖ-సికింద్రాబా
రద్దైన సందర్భాలు కూడా ఉన్నాయి. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరో రైలును చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. కానీ ఎక్కువ శాతం మంది విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడుపుతారనే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నారు.హైదరాబాద్-బెంగళూ

ఈ నెల 25న ఈ రైలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.కాచిగూడ-బెంగళూరు
Tags:India is another hundred between Visakha and Tirupati
