ఇంటర్ పరీక్షలు వ్రాసి వస్తున్న విద్యార్థులకు గాయాలు.
ఉండ్రాజవరం ముచ్చట్లు:
ఇంటర్ విద్యార్థులు ప్రయాణిస్తున్న వేలివెన్ను విద్యాసంస్థలు కు చెందిన కాలేజీ బస్సు లారీ ఢీకోనడంతో ప్రమాదం జరిగింది. వేలివెన్ను శశి విద్యాసంస్థల ఇంటర్ విద్యార్థులు తణుకు లో పరీక్షలు వ్రాసి తిరిగి వస్తుండగా మునిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని డీ కొనడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులకు విద్యాసంస్థల యాజమాన్యం గోప్యంగా చికిత్సను అందించడం వలన గాయపడిన విద్యార్థులు వివరాలు తెలియాల్సి ఉంది.

Tags;Injuries to students who are writing inter examinations.
