Natyam ad

సిమెంటురోడ్డు పనులు తనిఖీ

చౌడేపల్లె ముచ్చట్లు:
 
ఎంపీడీఓ నూతన కార్యాలయం ఎదుట వేసిన సిమెంటు రోడ్డుపనులను గురువారం పిఆర్‌ డిఈఈ ప్రసాద్‌ తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు సుమారు రూ:3 కోట్ల వ్యయంతో నూతన ఎంపీడీఓ, తహసీల్దార్‌ కార్యాలయ కాంప్లెక్స్ తోపాటు సిమెంటు రోడ్డుపనులను ప్రభుత్వం మంజూరుచేసిందన్నారు. భవన నిర్మాణ పనులు, సిమెంటు రోడ్డుపనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయడం జరిగిందన్నారు. త్వరలో మంత్రి పెద్దిరెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తిచేసేలా సిబ్బందికి, కాంట్రాక్టర్‌లను సూచించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీడీఓ సుధాకర్‌, మాజీ బోయకొండ కమిటీ మెంబరు ఠాణాధార్‌ నాగరాజ,శ్రంకర్‌రెడ్డి,హ్రనుమంతురెడ్డి లున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Inspect cement road works