గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి పరీక్షా కేంద్రంలో మృతి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్ డబ్ల్యూ పరీక్ష కేంద్రం లో పరీక్షలకు వచ్చిన విద్యార్ది మృతి చెందాడు. సైదాపురంకు చెందిన సతీష్ అనే విద్యార్థి ఇంటర్ ద్వితీయు సంవత్సరం పబ్లిక్ పరీక్ష వ్రాసేందుకు వచ్చి గుండెపోటుతో అశ్వస్తత కు గురి అయ్యాడు. గమనించిన పోలీస్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం సాయంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:Inter student died of heart attack at the examination center