పుంగనూరులోఇంటర్ విద్యార్థులు అదృశ్యం
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో నివాసం ఉన్న నూరుల్లాఖాన్ కుమారుడు పి.అంజాద్ఖాన్ (17), అతని స్నేహితుడు ఎస్.ఆసిఫ్ (16) లు శుక్రవారం అదృశ్యమైయ్యారు. పోలీసుల కథనం మేరకు అంజాద్ , ఆసిఫ్ ఇరువురు కలసి మదనపల్లెలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇలా ఉండగా ఇరువురు విద్యార్థులు రాత్రి ఇంటికి రాకపోవడంతో నూరుల్లాఖాన్ , కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ సుకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Inter students disappear in Punganur
