Natyam ad

ఒక ప్రైవేటు హాస్పిటల్లో దారుణం

-లిఫ్టు కూలి 9 మందికి గాయాలు

-పట్టించుకోని ఆసుపత్రి యజమాన్యం

-తూ తూ మంత్రంగా క్షతగాత్రులకు వైద్యం అందించిన యజమాన్యం

Post Midle

-బాధితులను పరామర్శించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

 

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా రాయచోటి మదనపల్లి మార్గంలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.
ఆసుపత్రిలోని లిఫ్ట్ కూలి అందులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి యజమాన్యం తూతూ మంత్రంగా వైద్య సేవలు అందించి బాధితులు ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులు ఇంటికి వెళ్లకుండా మా పరిస్థితి ఏమిటని ఆసుపత్రి ముందర ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని సర్ది చెప్పారు.

 

Tags:It is bad in a private hospital

Post Midle