Natyam ad

జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిని చేయాలి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సింగిరిగుంట, మార్లపల్లె గ్రామాలలో ఇంటింటా ప్రచారాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా క రపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని , ఉమ్మడి అభ్యర్థులకు గుణపాఠం నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ ఆంజప్ప, నాయకులు నాగభూషణం, కృష్ణారెడ్డి, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Jaganan should be made Chief Minister for the second time – MPP Bhaskar Reddy

Post Midle