3 కోట్ల మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందించిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
అమరావతి ముచ్చట్లు:
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 7 కీలక వైద్య పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య సహాయానికి సూచనలు ఇస్తున్నారు. సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వారీగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు వరకు నిర్వహించిన మొత్తం శిబిరాలు – 4677 శిబిరాలకు హాజరైనవారు – 19 లక్షలు + ఉచితంగా వైద్యులను సంప్రదించనవారు – 18 లక్షలు + ఇంటి వద్దే నిర్వహించిన రాపిడ్ పరీక్షలు – 5 కోట్లకు పైగా ఇప్పటివరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నవారు – 3 కోట్లకు పైగా.

Tags: Jagananna Arogya Suraksha’ provided free medical services to more than 3 crore people
