చౌడేపల్లెలో 28న బహిరంగ సమావేశంను జయప్రదం చేయండి
చౌడేపల్లె ముచ్చట్లు:
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు నూతనంగా పెన్షన్లు పంపిణీ లబ్దిదారులతో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంను జయప్రదం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం బుధవారం తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగా 377 మంది లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పెన్షన్ దారులతో పాటు, ప్రజాప్రతినిధులు,వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Tags: Jayapradham public meeting on 28th at Chaudepalle