కాలువ శ్రీనివాసులు గృహనిర్బంధం
అనంతపురం ముచ్చట్లు:
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇసుక దోపిడిపై పాదయాత్రకు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో రాయదుర్గం లో సుమారు 350మంది పోలీసులను అధికారులు మోహరించారు. రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులును గృహానిర్బంధం చేసారు. అయన ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నాయకులను అరెస్టులు చేసారు. బొమ్మనహాల్, కనేకల్లు స్టేషన్లలో పార్టీ నాయకులు నిరసనకు దిగారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తే తప్పేమిటంటూ పోలీసు అధికారులపై కాలవ మండిపడ్డారు. పౌర హక్కులను ప్రభుత్వమే కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Tags: Kanalua Srinivas are under house arrest

