కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిత్తూరు ముచ్చట్లు:
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభం పై మూషిక పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారూ ఈరోజు సిద్ధి బుద్ధి సమేతంగా హంసవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు… ఈ కార్యక్రమానికి కాణిపాకం,ఆగరంపల్లి, వడ్రంపల్లి,తిరువనంపల్లి కారకం పల్లి గ్రామానికి చెందిన శిర్ కరునిక వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సురేష్ బాబు,ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి,అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Tags: Kanipakam Brahmotsavam begins