పుంగనూరు నూర్షావల్లి దర్గా కమిటి చైర్మన్గా కరీముల్లా
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని నూర్షావల్లి బాబా దర్గా కమిటి అధ్యక్షుడుగా ఎస్కె.కరీముల్లా ను సున్నిఅంజుమన్ కమిటి ముస్లింలు ఎన్నుకున్నారు. శనివారం కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుమన్ కమిటి కార్యదర్శి అయూబ్ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలందరితోను కలసి దర్గాను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ముస్లిం నేతలు సయ్యద్మస్తాన్, జియాఉద్దిన్, జబ్బీర్, సాదీక్, నూర్, ఇమ్రాన్, సయ్యద్బాషా, బావాజాన్ , అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Karimullah as Chairman of Punganur Nurshavalli Dargah Committee