కరెంట్ కోతలపై కోమటిరెడ్డి మండిపాటు
హైదరాబాద్ ముచ్చట్లు:
కరెంట్ కోతల అంశం ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేసారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ పర్యటనల్లో కేసీఆర్ 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా…24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలకు చెబుతున్నారు. రాష్ట్రంలో లో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదు కేసీఆర్ సర్కార్. రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత ఉండనుంది. రైతులకు కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదు. ఇప్పటికీ నాకు కరెంట్ కోతపై నల్గొండ మండలం నుంచి పిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నల్గొండ మండలం అప్పాజీ పేటలో వారం నుంచి కనీసం 6గంటలు కూడా కరెంట్ రావడం లేదు.

పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు ఇచ్చేంతా కరెంట్ మీద దగ్గర లేకపోతే చెప్పండి సీఎం కేసీఆర్. మీ దగ్గర లేకపోయిన పక్కా రాష్ట్రాల నుంచి అయినా కొని ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వండి. ప్రభుత్వం మాటల నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారు. – మీరిచ్చిన రైతు బంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదు. కనీసం కరెంట్ అయిన పూర్తి స్థాయిలో ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలని కేసీఆర్ ను కోరుతున్నాను. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ అని అన్నారు.
Tags: Komati Reddy angry over current cuts
