Natyam ad

పెద్దిరెడ్డి,మిధున్‌రెడ్డిలను గెలిపించండి

పుంగనూరు ముచ్చట్లు:

మే 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను గెలిపించాలని పలువురు ప్రచారాలు చేశారు. పట్టణంలో సోమవారం పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ , శరణ్‌ లు ప్రచారం చేశారు. అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, సచివాలయాల కన్వీనర్‌ వరదారెడ్డి, ఉబేదుల్లా కాంపౌండులో ఇంటింటా ప్రచారం చేశారు. రహమత్‌నగర్‌లో కౌన్సిలర్‌ సాజిదాబేగం ప్రచారం నిర్వహించారు. మండలంలోని భీమగానిపల్లె, చండ్రమాకులపల్లె గ్రామాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేసి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి , ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ ప్రచారాలలో నాయకులు సుబ్రమణ్యం, వెంకట్రమణ, మురళి , అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Let Peddireddy and Midhun Reddy win

Post Midle