రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారుల పై దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తల ను ఢి కొట్టింది. భర్త లారీ చక్రాల కింద నలిగిపోయాడు. స్థానికులు లారీ కింద నుండి భార్యను లాగేసారు. లారీ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. . రోడ్డు ప్రమాదం తో రోడ్డు పై ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. స్థానికులు 100 ఫొన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ముందు వున్న ఆర్టీసీ బస్సును, లారీ ఓవర్ టేక్ చేయడం తో పాదచారుల పైకి దూసుకొని వచ్చిందని స్థానికులు అంటున్నారు.భార్య కళ్ల ముందు కొట్టు మిట్టులాడుతూ భర్త ప్రాణాలు విడిచాడు. భార్యచ తీవ్రంగా గాయపడింది. బాధితులు కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం.
Tags: Lorry disaster in Rajendranagar

