రికార్డుల నిర్వహణ తప్పనిసరి ..పీవో
బండి ఆత్మకూర్ ముచ్చట్లు:
సచివాలయంలో రోజువారి రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలని శ్రీశైలం ఐటిడిఎ పిఓ రవీంద్రా రెడ్డి సూచించారు. మండలంలోని పెద్దదేవళాపురం , బండి ఆత్మకూర్ సచివాలయాల ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్టర్లు ఆయన పరిశీలించారు. విధులకు వేళకు హాజరుకావాలని. నిర్లక్ష్యం వీడాలని సిబ్బందికి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లోతగు చర్యలు చేపట్టాలని సూచించారు ఏపీవో నాగార్జున, కార్యదర్శి నటరాజ్, పాల్గొన్నారు.
Tags: Maintenance of records is mandatory ..PO

