సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ జిల్లా పెందుర్తిలో 25న జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైవి సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు.25 న సబ్బవరం లో బస్సు యాత్రకు జరుగుతుంద ని,ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరని,30 లక్షలు మంది ప్రజలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేసిన నాయకుడు జగన్ అని అన్నారు.ప్రతినెల జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమం నిర్వహించేలా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారని,గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నమని అన్నారు.ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో దాడి చేయడానికి ప్రయత్ని స్తునాయని,ప్రతిపక్షాలను ప్రజలు నమ్మకుండా వైయస్సార్ పార్టీకి ఓటు వేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags: Make the social empowerment bus trip a success
