రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు
విశాఖపట్నం ముచ్చట్లు;
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసిం హారావు అన్నారు.కేంద్ర ప్రభుత్వం కూడా రైలు ప్రమాదంలో కుట్రకోణంపై ఆరా తీస్తోందని తెలిపారు. అవసర మైతే ఒడిశా రైల్వే ప్రమాదంపై సీబీఐ తో దర్యాప్తు చేస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తిం చి కఠిణంగా శిక్షిస్తామని స్పష్టం చేశా రు. వందల మంది ప్రాణాలు కోల్పోవ డంపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశార న్నారు. ఒడిశా రైలు ప్రమాదం కారణం గా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్ర మాలు నిరాడంబరంగా నిర్వహిస్తామ న్నారు.విశాఖలో హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన కూడా నిరాడంబ రంగా జరుగుతుందని తెలిపారు. అమిత్ షా విశాఖ పర్యటనలో కేవలం కేంద్రం చేపతుడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రసంగించనున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.

Tags:Many suspicions about the train accident
