కుటుంబ కలహాలతో విషం తాగి వివాహిత ఆత్మహత్య
చౌడేపల్లి ముచ్చట్లు:
కుటుంబ కలహాలతో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని కురప్పల్లికి చెందిన గిరి భార్య జి. లీలావతి (46) మంగళవారం వేకువ జామున భర్తతో గొడవపడి మనస్థాపం చెందింది. ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, ఆమెను 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Tags: Married suicide by drinking poison due to family quarrels