Date:27/11/2020
చిత్తూరు ముచ్చట్లు
వద్దని చెప్పినా వాగు దాటే ప్రయత్నం చేసాడో ఓ మినీ వ్యాన్ డ్రైవర్. చివరకు వాహనం వరద ప్రవాహంలో కొట్టుకు పోయింది. చిత్తూరు జిల్లా తంబళం పల్లి వద్ద అనేక మంది జనం చూస్తుం
డగా జరిగిన ఘటన సంచలనం రేపింది. నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తంబళ్ల పల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్దమండ్యం వద్ద చెరువు వద్ద
వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు కట్టపై నుండి అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలను గ్రామస్తు లు హెచ్చరించారు. వాగు ఉధృతి పెరిగిందని తెలియజేస్తున్నారు. ఎన్న డూ
లేనంతగా వరదలా ప్రవాహం పెరు గుతుండడంతో గ్రామస్తులంగా ఊరిబ యటకు వచ్చి గొడుగులు పట్టుకుని ప్రవాహాన్ని గమనిస్తున్నారు. వాగు దాటే ప్రయత్నం చేస్తున్న వారిని
నిలువరిస్తున్నారు.అయితే ఒక మినీ వ్యాన్ మాత్రం చెరువు దాటే ప్రయత్నం చేసి ఆ ప్రవాహం వేగంలో కొట్టుకు పోయింది. అందులో ఉన్న డ్రైవర్ కూడా కిందకు దూకినా.. అతను కూడా
బయటపడలేకపో యాడు. మినీ వ్యాన్ తోపాటు ఓ వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకు పోవడం స్థానిక ప్రజలు గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎలాంటి తాళ్లు లేదా.. రబ్బర్
ట్యూబుల వంటివి ఏమీ లేకపోవ డంతో గ్రామస్తులు కేకలు వేస్తూ నిస్స హాయంగా ఉండిపోవాల్సి వచ్చిం ది. మరోవైపు నెల్లూరు జిల్లాలో వరద ల్లో చిక్కుకున్న బస్సును అధికారులు
సురక్షితంగా బయటకు తీశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Tags:Mini van washed down the river