శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అంబాటి రాంబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు..ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించగా, టిటిడి అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అంబాటి, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గించకుండా విజయం అందించమని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Tags: Minister Ambati who visited Srivara