ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను బుధవారంవిడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ లో 4,45,358మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సెకండ్ ఇయర్ లో 4,23,455మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 72,299 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ లో 2,41,591 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత .54 శాతం, సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 61 శాతం. ఫస్ట్ ఇయర్ బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ 59 బాలురు,,బాలికలు 68 శాతం పాస్ అయ్యారు.
Tags: Minister Botsa releasing Inter results

