పుంగనూరులో వెంకట్రమణ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ బలిజ సంఘం అధ్యక్షుడు జయరాం తండ్రి వెంకట్రమణప్ప (70) బుధవారం మృతి చెందారు. విషయం తెలియగానే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకట్రమణప్ప సేవలను కొనియాడారు. నివాళులర్పించిన వారిలో బలిజ సంఘ నాయకులు నానబాలగణేష్, పూలత్యాగరాజు, కొండవీటి నరేష్, మిద్దింటి కిషోర్, బండకుమార్ తదితరులు ఉన్నారు.

Tags; Minister Peddireddy paid homage to Venkataramana’s body in Punganur
