పుంగనూరులో ఉరుసు పోస్టర్లు విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉరుసు పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. పట్టణంలోని హజరత్ సయ్యద్నూర్షావల్లిబాబా ఉరుసు కార్యక్రమాలు ఈనెల 28 నుంచి మే 1 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు పట్టణ ముస్లింలు కరీముల్లా, నౌషాద్, జియాఉద్దిన్ ఆధ్వర్యంలో ఉరుసు పోస్టర్లను మంత్రి విడుదల చేసి, హిందూముస్లింలు ఐకమత్యంతో ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, రాయలసీమ జిల్లాల మైనార్టీసెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Minister Peddireddy released Urusu posters in Punganur
