Natyam ad

చౌడేపల్లెలో16న ఆలయాలను సందర్శించనున్న మంత్రి పెద్దిరెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:


పుంగనూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గల పలు ఆలయాల్లో జరుగుతున్న అభివృద్దిపనులను మంగళవారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పీఏ ముని తుకారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి అభివృద్దిపనులను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఉదయం8:45 గంటలకుశ్రీ మాధవరాయస్వామి దేవాలయం రొంపిచెర్ల మండలం ,9:30 అయ్యప్పస్వామి దేవాలయం, యర్రాతివారిపల్లె సదుం మండలం,10:30 గంటలకు గార్గేయ మునీశ్వరస్వామి దేవాలయం, దుర్గం కొండ సోమల మండలం, 12:30 గంటలకు అగస్తీశ్వరస్వామి దేవాలయం నెక్కుంది పుంగనూరు మండలం,1:30 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం,శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి దేవాలయం,2:30 గంటలకు బోయకొండ దేవాలయం చౌడేపల్లె మండలంలో పర్యటిస్తారన్నారు. అలాగే 3:30 గంటలకు మాణిక్య వరదరాజ స్వామి దేవాలయం, హనుమంతరాయ దిన్నె ఆంజనేయస్వామి దేవాలయం పుంగనూరు మండలాల్లో పర్యటించనున్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులూ,్య భిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

 

Tags: Minister Peddireddy will visit the temples in Chaudepalle on 16th

Post Midle
Post Midle