విశాఖలో మంత్రి సురేష్ పర్యటన
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ నగరంలో కొన సాగుతున్న పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఉదయం 5 గంటల నుంచి వీధుల్లోకి వచ్చి పనుల పరిశీలించారు.జీవీఎంసీ అధికారులు, కార్మి కులతో మాట్లాడి పట్టణ వాసులను పారిశుధ్య పనుల తీరు అడిగి తెలుసుకున్నారు మంత్రి.పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్వయంగా మంత్రి సురేష్ చీపురు చేతపట్టి పారిశుద్ధ్య నిర్వహణ పై ఉన్న ప్రాధాన్యతను వివరించారు.నిర్లక్ష్యం వహించకుండా కార్మికులు అంకితభావంతో పని చెయ్యాలని సూచించారు.
Tags: Minister Suresh’s visit to Visakhapatnam

