ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ప్రసాద్రెడ్డిని గెలిపించాలి
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ప్రసాద్రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలోని అన్నిప్రాంతాల్లోను ప్రచారాలు ముమ్మరం చేశారు. శుక్రవారం కొత్తపేటలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్ ఆధ్వర్యంలో రహమత్నగర్లో ఓటర్లను గుర్తించి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే నానబాలవీధి, చర్చివీధుల్లో కౌన్సిలర్ అర్షద్అలి, ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి,మక్కాకమిటి డైరెక్టర్ ఖాదర్ ప్రచారం నిర్వహించారు. కొత్తయిండ్లలో కౌన్సిలర్ మమత, వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మణ్రాజు ప్రచారం చేశారు. ఎన్.ఎస్.పేటలో కౌన్సిలర్ నూర్జహాన్, వైఎస్సార్సీపీ నాయకులు సలామత్ ప్రచారాలు నిర్వహించారు. ఈ ప్రచారాలలో పార్టీ నాయకులు తుంగాబాబు, మహబూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags; MLC candidate Shyam Prasad Reddy should win