రంజాన్ వేడుకలతో కళకళలాడుతున్న మసీదులు
ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ముస్లీంలు
విశాఖపట్నం ముచ్చట్లు:
ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష లో పాల్గొన్న ముస్లింలు రంజాన్ పండు గను పురస్కరించుకుని ఈద్గా స్థలం వద్ద ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ఆచరిం చారు.విశాఖలో పలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ముస్లిం మత గురువులు తక్రిర్ పాటించారు. ఖురాన్ లో సూక్తులు వివరించారు. అనంతరం ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను ఆచరించి న ముస్లిం సోదరులు ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ శుభా కాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో అలరించారు.

Tags; Mosques are bustling with Ramadan celebrations
