రక్షణశాఖ కమిటి మెంబరుగా ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
దేశ రక్షణశాఖ, రూల్స్కమిటి మెంబరుగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రెడ్డెప్ప స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిటి తొలి సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డికి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆశయాలను అమలు జరిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Tags: MP Reddappa as a member of the Defense Committee