Natyam ad

అయ్యన్నపాత్రుడు ఏమి సాధించడని నారా లోకేష్ నర్సీపట్నం వచ్చాడు – ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

నర్సీపట్నం ముచ్చట్లు:
టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నర్సీపట్నం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి రావడం పై ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ విలేకరులతో మాట్లాడుతూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఏమి సాధించారు అని నారా లోకేష్ అయ్యన్న ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు అని అన్నారు. పోలీసులు కేసులు పెట్టి ఏమి పీకుతారు అనే అయ్యన్నపాత్రుడు మరి పోలీసులు 41(A) నోటీసు ఇవ్వడానికి ఇంటికి వెళ్లితే అయ్యన్నపాత్రుడు ఇంట్లో పిల్లిలాగా దాక్కోవడం ఏంటి అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు కోర్టు నుండి స్టే తెచ్చుకొని ఇంట్లో దాక్కుంటే నారా లోకేష్ వచ్చి పరామర్శించారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల లో  టీడీపీ మీటింగ్ లో అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మంత్రుల పై అనేక అనీచిత వ్యాఖ్యలు చేస్తూ చెత్త నాయకులు రాజకీయనాయకులు అయ్యిపోతున్నారు అని అన్నారు. అది నిజమే 1983 లో కూడా ఆ చెత్త నాయకులే ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవాచేశారు.  24 గంటల పాటు పిల్లిలా బెడ్ రూమ్ లో దాక్కున్నా అయ్యన్నపాత్రుడు తన పార్టీ కార్యకర్తలను ఇంటి చుట్టు కాపలా పెట్టుకున్న అయ్యన్నపాత్రుడు ఎంత ధైర్యవంతుడో అందరికి తెలిసిందన్నారు. 41(A) నోటీసు తీసుకోలేని ధైర్యం లేని అయ్యన్నపాత్రుడు ధీరుడు,సురుడు,వీరుడు అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు.
 
Tags:Nara Lokesh came to Narsipatnam to see what Ayyannapatra deserves
– MLA Petla Uma Shankar Ganesh