పుంగనూరులో 12న జాతీయ లోక్అదాలత్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం ఆయన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్జడ్జి సిందుతో కలసి అధికారులు , న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన అన్ని కేసులను లోక్అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.
Tags: National Lok Adalat on the 12th in Punganur