జాతీయ ఓటర్ల దినోత్సవం
శ్రీకాకుళం నగరంలో భారీ ర్యాలీపాల్గోన్న జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం ముచ్చట్లు:
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఓటరు కారణం అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన ఓటర్లకు గుర్తుంపు కార్డ్లులు పంపిణి చేశారు . గురువారం శ్రీకాకుళం నగరంలో 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ చేపట్టారు . ఈ ర్యాలీ నగరం లో సూర్యమహల్ జంక్షన్ నుండి ఏడు రోడ్ల కూడలి వరకు సాగింది . అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ అవగాహనా కల్పించారు . శ్రీకాకుళం జిల్లాలో 18 ,59 ,910 మంది ఓటర్లు ఉన్నారనున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయితిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఓటు హక్కు ప్రాధాన్యత పై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు . 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా తమ పేరు నమోదు చేసుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: National Voter’s Day