శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలను టీటీడీ ప్రవేశపెట్టింది. వేదాశీర్వచనం సేవ ప్రతిరోజూ ఉంటుంది. రూ.500/- చెల్లించి ఈ సేవాటికెట్ ను బుక్ చేసుకునే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందజేస్తారు. శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన సేవ నిర్వహిస్తారు. ఒక్కో సేవాటికెట్ కు రూ.250/- చెల్లించి భక్తులు బుక్ చేసుకోవచ్చు.

Tags: New Veda Shirvachana, Kumkumarchana Arjita Services at Sri Govindarajaswamy Temple
