పోలీసులపై దాడి కేసులో నిందితులకు ’’నో’’ బెయిల్
-బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏడిజె
మదనపల్లె ముచ్చట్లు:

అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు సోమవారం మదనపల్లి ఏడిజే కోర్టు న్యాయ మూర్తి అబ్రహం బెయిలు పిటిషన్ల క్యాన్సిల్ చేశారు. ఈనెల నాలుగో తేదీ అంగళ్ళు పుంగనూరు అల్లర్లు సృష్టించిన టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు తదితరముద్దాయిలకు బెయిల్ ఇవ్వవద్దని పి.సుధాకరరెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎస్ దుష్యంత్ రెడ్డి, ఏపీపీ తమ వాదనను గురువారం మదనపల్లి ఏడిజే అబ్రహాంకు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేసినసంగతి తెలిసిందే. సోమవారం ఇరువురి వాదనలుపరిశీలించి అన్ని బెయిల్ పిటిషన్లు నిరాకరించగా టీడీపీ కంగుతింది.
Tags:”No” bail for the accused in the attack on police case
