తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రి -తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక ఉత్తర్వులు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉప సంహరించింది.రాష్ట్రంలో ఏ కేసులో నైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐ కి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.ఇందుకు సంబంధించి ఆగస్టు 30 న జీవో 51 ను ప్రభుత్వం జారీ చేసింది.ఇక రాష్ట్రంలో ఏ కేసు నైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవో లో పేర్కొంది.ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tags: No entry for CBI in Telangana – Sensational orders of Telangana government