రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గిద్దలూరు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా గిద్దలూరు – నంద్యాల రోడ్డు మార్గం నల్లమల అటవీ ప్రాంతంలో బైక్ ను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. మరోక మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమం గావుంది. ప్రమాదం సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు హైవేమొబైల్ పోలీసులు వర్ర శంకరయ్య, సయ్యద్ ఖాజావలి ఘటనా స్థలానికిచేరుకొని క్షతగాత్రురాలిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తరువాత వారు మోటార్ సైకిల్ ను డీ కొట్టిన లారీని వెంబడించి డ్రైవర్ను, లారీని పట్టుకొని గిద్దలూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఘటనాస్థలానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు చేరుకొని సందర్శించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags: One killed in road accident