ఆపరేషన్ చిరుత నాలుగో చిరుత కూడా దొరికింది
తిరుపతి ముచ్చట్లు:
గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత
చిక్కింది. ఆదివారం రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. జూన్ నె 24 న, ఈ నెల 14, 17 న చిరుతలు బోనులో చిక్కాయి. దీంతో శేషాచలకొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది. ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
Tags: Operation Cheetah also found a fourth cheetah

