Natyam ad

పుంగనూరులో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ ఉద్యోగులకు రెగ్యూలర్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణంలోని సచివాలయ ఉద్యోగులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి , పర్మనెంట్‌ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ సీమ జిల్లాల ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యదర్శి మహబూబ్‌బాషా, కౌన్సిలర్‌ సాజిదాబేగం, జావీద్‌, తబషీర్‌, సుల్తాన్‌ఖాజా, ఇర్ఫాన్‌, ఇమ్రాన్‌, సుభాన్‌, షపివుల్లా, నవాజ్‌, ఉమ్మర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Palabhishekam to Chief Minister’s portrait in Punganur

Post Midle