ప్రజా సంక్షేమమే పెద్దాయన ధ్యేయం -మిద్దింటి కిషోర్
చౌడేపల్లె ముచ్చట్లు:
ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి కృషి చేస్తున్నారని యువకాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మరియు చిత్తూరు రాజంపేటపార్లమెంటరీ నియోజకవర్గాల వైసిపి యువజన అధ్యక్షుడుమిద్దింటి కిషోర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు .భారీ స్థాయిలో కటౌట్ ఏర్పాటుచేసి అదేవిధంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ మిద్ది౦టి శంకరనారాయణ హాజరయ్యారు నిరంతరం ప్రజాభివృద్ధి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని సమకాలిన రాజకీయాలకు మూల విరాటని ఆయన అన్నారు. తనను నమ్ముకున్న అభిమానులు కార్యకర్తలు నాయకులను సముచితంగా గౌరవించే తత్వం శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందన్నారుు ఈ భారీ స్థాయిలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన వార్డు మెంబరు సర్పంచుఎంపీటీసీ సభ్యులు వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు అందరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల రాము చౌడేపల్లి సర్పంచ్ శ్రీరామ్ భరత్ వరుణ్, ఉపసర్పంచ్ అల్తాఫ్ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి, మంజునాథరెడ్డి ,సురేంద్ర రాయల్ పాల్గొన్నారు.
Tags: Peddayana’s mission is public welfare – Middinti Kishore