19న పెద్దిరెడ్డి, మిధున్ నామినేషన్లు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తారు. పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ఆభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి, అక్కడి నుంచి ర్యాలీ రామసముద్రం రోడ్డు మీదుగా ఎన్ఎస్.పేట, పుంగమ్మ చెరువు కట్టమీదుగా బ్రాహ్మణవీధి, సెంటర్లాడ్జి, నాగపాళ్యెం, ఇందిరా సర్కిల్, గోకుల్ సర్కిల్ వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అభిమానులు వేల సంఖ్యలో తరలిరానున్నారు. అలాగే ఎంపీ మిధున్రెడ్డి తరపున సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లింలు అధిక సంఖ్యలో రాయచోటికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Tags: Peddireddy and Midhun nominations on 19th